ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ
తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని కోర్టు, రెవెన్యూ కార్యాలయం, పోలీస్ స్టేషన్లలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యూనిటీ, కల్చర్ తోనే దేశానికి బానిసత్వం నుంచి విముక్తి వచ్చిందని జస్టిస్ అనూష అన్నారు. ఎంతో మంది అమవీరుల త్యాగఫలంతో మనకు స్వాతంత్రం వచ్చిందని ఎమ్మార్వో గీతావాణి అన్నారు. టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లులో సీఐ బాబి, సంగమేశ్వరావులు జెండా వందనం చేయగా..మున్సిపల్ కార్యాలయంలో కటకం దీపిక చిన్నారులతో కలిసి స్వాతంత్రం వేడుకలు జరుపుకున్నారు.