- నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్
- జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ నేతలు
నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డితో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం టిడిపి నాయకులు కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా అబ్ధుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్య్రం వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వాలు ప్రభుత్వాధికారులే కాకుండా ప్రజలు కూడా దేశం పట్ల బాధ్యతగా ఉండాలన్నారు. ఈ 78 సంవత్సరాల స్వాతంత్రం ప్రజలకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో… నూతన ప్రభుత్వం ఏర్పాటు కూడా అంతే ఆనందాన్ని కలిగిస్తుంది.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జడ్పీ చైర్మన్ పెంచల్ బాబు యాదవ్, టిడిపి కార్యదర్శులు జెన్నీ రమణయ్య, రాజా నాయుడు, నన్నే సాహెబ్, మామిడాల మధు, సాబీర్ ఖాన్, పెంచల నాయుడు తదితరులు పాల్గొన్నారు.