జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ ఆనంద్
నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో…78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్…జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చేందుకు ప్రాణ త్యాగం చేసిన మహాత్ముల గురించి స్మరించుకున్నారు. విద్యార్థులకి కలెక్టర్ మిఠాయిలు పంచిపెట్టారు. ఎందరో మహానుభావుల త్యాగ, కృషి, పోరాట ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చిందని గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, డిఆర్వో లవన్న, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.