- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన విద్యా సంస్థల చైర్మన్ రంగిశెట్టి వేణు
- ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు
నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని ఓవెల్ జూనియర్ కళాశాలలో… 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ రంగిశెట్టి వేణు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని… కళాశాల ఆవరణలో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు, అధ్యాపకులు, విద్యార్థుల ఉపన్యాసాలు విద్యార్థులకి స్ఫూర్తిని కలిగించేలా అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం చైర్మన్ వేణు మీడియాతో మాట్లాడారు. ఎందరో దేశభక్తుల కృషి ఫలితంగానే స్వాతంత్యం పొందామని గుర్తు చేశారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల సీఈవో ఆర్ ప్రమీల, జీఎం మహదేవ్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ బాలు, డీజీఎంలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.