ఎంద‌రో మ‌హానుభావుల త్యాగ‌ఫ‌లిత‌మే స్వాతంత్రం

  • ప్ర‌తీ ఒక్క‌రూ అమ‌ర‌వీరుల అడుగు జాడ‌ల్లో న‌డవాలి
  • ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి
  • కోవూరులో అట్ట‌హాసంగా 78వ పంద్రాగ‌స్ట్ వేడుక‌లు
  • జాతీయ జెండాను ఆవిష్క‌రించిన ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా కోవూరు మండలం తాలూకా ఆఫీస్ ప్రాంగణంలో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు అట్టహాసంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ముందుగా ఎమ్మెల్యేకి ఐ హైమారావు, ఎస్సై రంగనాథ్ గౌడ్ వారి సిబ్బంది ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్క‌రించి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. పిల్లలు, ఎన్‌సీసీ పాలిటెక్నిక్ కాలేజీ క్యాడేట్స్ క‌వాతుతో ఎమ్మెల్యేని వేదిక‌పైకి సాద‌రంగా ఆహ్వానించారు. విద్యార్థి విద్యార్థినీలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆమె తిలకించారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం కారణంగా మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని గుర్తు చేశారు. కోవూరుని అవినీతిరహిత, వివాదరహిత నియోజకవర్గగా తీర్చిదిద్ది ప్రజలకి అంకితం చేస్తానని హామీ ఇచ్చారు…ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇంకా మల్లారెడ్డి, ప్రోగ్రాం ఆర్గనైజర్ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, ఐదు మండలాల అధికారులు నాయకులు కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *