- రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
- నెల్లూరు పెరేడ్ మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారాయణ
- పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి, కలెక్టర్, ఎస్పీ
నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో అట్టహాసంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకి…రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విచ్చేశారు. ముందుగా మంత్రికి కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, కమిషనర్ సూర్యతేజలు పుష్పగుచ్చం అందచేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి, జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్లు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రసంగించారు. స్వాతంత్ర సమర యోధులకు ఆయన నివాళులర్పించారు. ఎందరో మహానుభావుల త్యాగం, కృషి, పోరాట ఫలితమే 1947 ఆగస్ట్ 15వతేదీన మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని తెలిపారు. ప్రభుత్వాలు ప్రభుత్వాధికారులే కాకుండా ప్రజలు కూడా దేశం పట్ల బాధ్యతగా ఉండాన్నారు.