అల్లూరులో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు

  • మండ‌లంలో రెప‌రెప‌లాడిన మువ్వెన్న‌ల జెండా
  • జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన అధికారులు

నెల్లూరు జిల్లా అల్లూరు మండ‌లంలో 78వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా మండ‌లంలో మువ్వెన్న‌ల జెండా రెప‌రెప‌లాడింది. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శశిరేఖ ఎంపీడీవో జ్యోతి కలిసి జండాను ఎగరవేశారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇటీవల నిర్వహించిన పోటీలలో విజయం సాధించిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఎంపీడీవో జ్యోతి మాట్లాడుతూ… ఎంతో మంది త్యాగమూర్తుల పోరాటపటీమే నేడు మన ఈ స్వేచ్ఛ జీవితమని గుర్తు చేశారు. అలాంటి వారిని ఆగస్టు 15 స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందని వారి ఆశయ సాధనానికి యువత కృషి చేయాలని కోరారు. అలాగే రెవెన్యూ కార్యాలయంలో తహసిల్దార్ లక్ష్మీనారాయణ జెండాను ఎగరవేసి సిబ్బందికి మిఠాయిలను పంచిపెట్టారు. మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో పాటు వివిధ కార్యాలయాలలో మువ్వన్నెల జెండాలను ఎగరవేసి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి .ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *